ఇంటర్​ పరీక్షా కేంద్రాన్ని  తనిఖీ చేసిన అడిషనల్​ కలెక్టర్

ఇంటర్​ పరీక్షా కేంద్రాన్ని  తనిఖీ చేసిన అడిషనల్​ కలెక్టర్

మెదక్​ టౌన్​, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​అన్నారు. గురువారం కొల్చారం మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కాలేజ్​పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్ష కేందంలో కల్పించిన వసతులను గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్​గఫార్,  పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్​ ఉన్నారు.