
హైదరాబాద్, వెలుగు: ట్రావెల్ సేఫ్పేరుతో రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చిన ‘టీ సేఫ్’ యాప్ కు మంచి స్పందన లభిస్తున్నదని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖా గోయల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన రిలీజ్ చేశారు. యాప్ ను ప్రారంభించిన ఐదు నెలల కాలంలోనే 10,958 మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, 17,263 మంది ట్రిప్స్ ను ట్రాక్ చేశామని వెల్లడించారు. మహిళలు, యువతులు, పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించవచ్చనే భరోసా కల్పిస్తున్నామన్నారు.
యాప్ ద్వారే కాకుండా వెబ్సైట్, డయల్100 ద్వారా కూడా మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టీ -సేఫ్ ద్వారా 100 లేదా 112 నంబర్కు కాల్చేస్తే 5 నిమిషాల్లో పెట్రోలింగ్, బ్లూకోల్ట్ వాహనాలు లొకేషన్ కు వచ్చి ఆపదలో చిచ్చుకున్నవారిని కాపాడుతాయని వెల్లడించారు. యూజర్స్తమ లైవ్ లొకేషన్ను ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. టీసేఫ్యాప్ ను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారు. మార్చి 12 న సీఎం రేవంత్ రెడ్డి ఈ యాప్ను ప్రారంభించారు. 4.8 రేటింగ్ తో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది.