ఆదిలాబాద్ జిల్లా పర్యాటకాన్ని ప్రపంచానికి చాటాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ జిల్లా పర్యాటకాన్ని ప్రపంచానికి చాటాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; జిల్లాలోని యువ సోషల్​ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పాలని కలెక్టర్​ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లాలోని పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్నంగా నిర్వహించిన ‘99 డేస్‌‌‌‌ డిజిటల్ టూరిజం చాలెంజ్ - రీల్స్ కాంపిటీషన్’  గురువారంతో ముగిసింది. 

ఈ సందర్భంగా ఆదిలాబాద్​ పట్టణంలోని టీటీడీసీ హాల్‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యువ ఇన్ఫ్లుయెన్సర్ విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన టెక్నాలజీతో క్రియేటివిటీని జోడించి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ రాజేశ్వర్, టూరిజం అధికారి రవికుమార్, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో విష్ణువర్ధన్,  కళాకారులు పాల్గొన్నారు.