గందర గోళంగా ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం

గందర గోళంగా ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం
  •     ఆందోళనకు దిగిన బీజేపీ కౌన్సిలర్లు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో చైర్​పర్సన్​ బండారి అనూష అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. కమిషనర్ ​​జగదీశ్వర్​ గౌడ్​ ఎజెండాను చదివి వినిపించారు. పట్టణంలోని సర్వే నంబర్​ 349లోని విజయ డెయిరీకి సంబంధించిన పాత పాల శీతలీకరణ కేంద్రం స్థలంలో ఎకరం భూమిని కాంగ్రెస్  జిల్లా కార్యాలయానికి ఇచ్చేందుకు ఎన్​వోసీ ఇచ్చేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. 

పోడియం ముందు ఎజెండా ప్రతులను చింపి నిరసన తెలిపారు. గందరగోళం మధ్య ఓటింగ్​ నిర్వహించగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు పలువురు ఇండిపెండెంట్​ సభ్యులు మద్దతు తెలపడంతో తీర్మానం పాస్​ అయినట్లు ప్రకటించారు. కాగా, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోరం లేకపోయినా తీర్మానం నెగ్గినట్లు చెబుతున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ముందు బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట ఆందోళనకు దిగారు.