ఆదిలాబాద్, వెలుగు: నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 సెప్టెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్స్లో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరోసారి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న 500 బ్లాక్లలో 4వ స్థానంలో నిలిచి మరో అవార్డు దక్కించుకుంది. దక్షిణ భారతంలోని జోన్- 3లో మొదటి ర్యాంక్ సాధించిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు.
ఈ అసాధారణ ప్రదర్శనకు గుర్తింపుగా మండలానికి రూ.1.5 కోట్లు పురస్కారం లభించిందని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసే మండలాల్లో నార్నూర్ ఒకటిగా నిలిచిందని, జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. తాజాగా డెల్టా ర్యాంకింగ్స్తో పాటు, ఇప్పటి వరకు నార్నూర్ వివిధ పురస్కారాలు, ప్రోత్సాహకాలను కలిపి మొత్తం రూ.2.78 కోట్లు పొందిందని తెలిపారు.
