Manoj Muntashir: ఖరీదైన కారు కొన్న 'ఆదిపురుష్’ రైటర్..ధర ఎంతంటే?

Manoj Muntashir: ఖరీదైన కారు కొన్న 'ఆదిపురుష్’ రైటర్..ధర ఎంతంటే?

ఆదిపురుష్ (Adipurush)  చిత్రంలోని డైలాగులు ఫేమస్ అయ్యాయో లేదో గానీ ఆ డైలాగ్స్ రాసిన రైటర్ మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) మాత్రం చాలా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పలు వివాదాలకి దారితీశాయి. ఇక అప్పటి నుంచి మనోజ్ ముంతాషిర్ ఏం చేసిన ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. 

లేటెస్ట్గా రైటర్ మనోజ్ ముంతాషిర్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు 3 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కొనుగోలు చేశాడు. ఈ లేటెస్ట్ మెర్సిడెస్ కారును బాలీవుడ్ లో అతి తక్కువ మంది సెలబ్రేటిస్ మాత్రమే వాడుతున్నారు.

అందులో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా మత్రమే ఈ కారుని వాడుతున్నారు..ఇప్పుడు మనోజ్ ముంతాషిర్ కూడా ఆ కారును కొనుగోలు చేయడంతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 

మనోజ్ ముంతాషిర్ తేరే మిట్టి, గల్లియన్, కౌన్ తుజే లాంటి కల్ట్ సాంగ్స్ రాసి ఎంతో ఫేమస్ అయ్యాడు. అలానే ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కోసం కూడా మనోజ్ పనిచేశారు.