తునికాకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి

తునికాకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి
  •    జిల్లా అటవీ కార్యాలయం ముందు ఆదివాసీల ధర్నా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : తునికాకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ ​చేస్తూ సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్​ ను కూలీలకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బోనస్​ చెల్లించారని, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కానీ ఆదిలాబాద్​ జిల్లాలో మాత్రం చెల్లింపులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.