
ఈ ఏడాది జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే చాన్స్ ఎడ్లిన్ కేస్టిలినో కొట్టేసింది.శనివారం ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో జరిగిన మిస్ దివా యూనివర్స్ 2020 పోటీల్లో మంగళూరుకు చెందిన మోడల్ మిస్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. జబల్ పూర్ కు చెందిన ఆ వృతి చౌదరి ఆమెకు గట్టి పోటీనిచ్చింది.అయితే, మిస్ దివా సుప్రానేషనల్ తో ఆవృతి సరిపెట్టుకుంది. మిస్ సుప్రానేషనల్ పోటీలకు ఆమె ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్దివా రన్నరప్ గా పుణేకి చెందిన నేహా జైస్వాల్ నిలిచింది.
మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా,ఆంటోనియా పోర్లిడ్ , ఆశాభట్ , డిజైనర్లు శివన్ భటియా, నరేశ్ కుక్రేజా, నిఖిల్ మెహ్రా, బాలీవుడ్నటులు యామీ గౌతమ్ , ఆదిత్య రాయ్ కపూర్ ,అనిల్ కపూర్ లు మిస్ దివా జడ్జిలుగా వ్యవహరించారు. మిస్ దివా పోటీలకు గత ఏడాది నవంబర్లో ఆడిషన్స్ నిర్వహించారు. హైదరాబాద్ , చెన్నై,చండీగఢ్ , బెంగళూరు. లక్నో, కోల్ కతా, ఇండోర్ ,పుణే, ఢిల్లీ ఆడిషన్స్ నిర్వహించారు. పోయినేడాది డిసెంబర్ లో తుది దశ ఆడిషన్లను ముంబైలో నిర్వహించి, 20 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. శనివారం వారితో ఎనిమిదో ఎడిషన్ మిస్ దివాయూనివర్స్ పోటీలు పెట్టారు. మిస్ దివాగా ఎడ్లిన్ కు అన్ని అర్హతలున్నాయని లారా దత్తా చెప్పింది. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం ఇండియాకు దక్కుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఎడ్లిన్ కు పోయినేడాది విన్నర్ వర్తికా సింగ్ కిరీటం పెట్టింది.