రాజాసింగ్‌‌పై పీడీ యాక్ట్‌‌కు బోర్డు ఆమోదం

రాజాసింగ్‌‌పై పీడీ యాక్ట్‌‌కు బోర్డు ఆమోదం

హైదరాబాద్‌‌, వెలుగు: గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై ప్రివెంటీవ్‌‌ డిటెన్షన్‌‌(పీడీ) యాక్ట్‌‌ అమలుకు అడ్వయిజరీ బోర్డ్‌‌ ఆమోదం తెలిపింది. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్‌‌ను సమర్థిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్‌‌ను ఎత్తివేయాలని రాజాసింగ్‌‌ భార్య ఉషాబాయీ వేసిన రివోక్‌‌ పిటిషన్‌‌ను రిజెక్ట్‌‌ చేసింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించింది. సుప్రీంకోర్ట్‌‌ ప్రొసీజర్‌‌ ప్రకారమే చర్యలు తీసుకున్నారని గుర్తించింది.

చర్లపల్లి సెంట్రల్‌‌ జైలులో ఉన్న రాజాసింగ్‌‌పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది. బోర్డ్‌‌ ఇచ్చిన తీర్పుపై రాజాసింగ్‌‌తరుఫు న్యాయవాది కరుణసాగర్‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డ్‌‌ తీర్పును సవాల్‌‌ చేస్తూ ‌‌హైకోర్టుకు వెళ్తామన్నారు. పీడీ యాక్ట్‌‌ను సవాల్‌‌ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌‌ ఫైల్‌‌ చేశామన్నారు. శుక్రవారం ప్రభుత్వం కౌంటర్ ఫైల్‌‌ దాఖాలు చేయాల్సి ఉందని అన్నారు. బోర్డు తీర్పుపై కూడా అప్పీల్‌‌కు వెళ్తామని చెప్పారు.