
న్యూఢిల్లీ : గౌతమ్ అదానీ వ్యాపార సంస్థలపై తీవ్రమైన ఆరోపణలు చేసి న హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టుపై విచారణ జరపాలని అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్పై విచారణ జరిపేం దుకు సుప్రీం ఓకే చెప్పింది. శుక్రవా రం విచారించనుంది. హిండెన్ బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఒక కమిటీని నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తివారీ కోరారు. ఈ పిల్ పై అత్యవసర విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన బెంచ్కు ఆయన విజ్ఞప్తి చేశారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో దేశ ప్రతిష్ట మసకబారింద ని ఆయన పేర్కొన్నారు.