
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన కాంటినెంటల్ హాస్పిటల్స్ తన గచ్చిబౌలి బ్రాంచ్లో ఇంటర్నేషనల్ ఫేషియల్, కార్నియో ఫేషియల్ సెంటర్ను ప్రారంభించింది. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి దీనికి నాయకత్వం వహిస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు లేదా జీవితంలో అనుకోకుండా సంభవించే ప్రమాదాల కారణంగా ముఖంలో ఏర్పడ్డ అంగవైకల్యాలను ఇక్కడ నయం చేస్తారు.
జన్యులోపం, పౌష్టికాహార లోపం వల్ల కూడా ముఖం అందవిహీనంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు పెరుగుతున్న కొద్దీ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తారని, సమాజంతో కలవకుండా ఒంటరిగా జీవిస్తారని గురు చెప్పారు.
హైదరాబాద్లో శ్రీనివాస రెడ్డి ఒక్కరే ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్, ఫేస్ డిజైనింగ్ సర్జన్అని వెల్లడించారు. 1996 సంవత్సరం నుంచి 40 వేలకు పైగా ముఖ- అంగవైకల్య ఆపరేషన్స్ చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. కాస్మటిక్ డెర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్, కాస్మటిక్ డెంటల్ సర్జన్స్, ఈఎన్టీ సర్జన్స్తో కూడిన టీమ్ ఇలాంటి ఆపరేషన్లు చేస్తుందని గురు చెప్పారు.