
అల్ రయాన్ (ఖతార్): ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్లో ఇండియా ఫుట్బాల్ టీమ్ బోణీ చేయలేకపోయింది. శనివారం జరిగిన గ్రూప్–బి తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా 2–0తో ఇండియాకు చెక్ పెట్టింది. ఆసీస్ తరఫున జాక్సన్ ఇర్విన్ (50వ ని.), జోర్డాన్ బ్రోస్ (73వ ని.) గోల్స్ చేశారు. దీంతో కంగారూలు మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు.
తొలి హాఫ్లో బలమైన ఆసీస్ ఎదురుదాడులను ఇండియా సమర్థంగా అడ్డుకుంది. 50 నిమిషాల వరకు కంగారూలకు గోల్స్ చేసే చాన్స్ ఇవ్వలేదు. కానీ సెకండ్ హాఫ్లో ఇండియా డిఫెన్స్ చతికిలపడింది. ఆసీస్ ఫార్వర్డ్ షార్ట్ పాస్లతో బాల్ను ఎక్కువగా ఆధీనంలో ఉంచుకున్నారు. దీంతో ఒత్తిడికి లోనైన ఇండియా డిఫెండర్లు బాల్ కోసం శ్రమించి గోల్ చేసే అవకాశాలను జారవిడిచారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆసీస్ వరుస విరామాల్లో రెండు గోల్స్ చేసింది. స్కోరును సమం చేసేందుకు ఇండియా చివరి వరకూ ప్రయత్నించి ఫెయిలైంది. ఈ నెల 18న జరిగే రెండో మ్యాచ్లో ఇండియా ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది.