డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం..60 ఏండ్ల తర్వాత పాక్‌‌కు ఇండియా

డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం..60 ఏండ్ల తర్వాత పాక్‌‌కు ఇండియా

న్యూఢిల్లీ: దాదాపు 60 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ గడ్డపై డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ పోరు ఆడేందుకు ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ రెడీ అవుతోంది. ఈ మేరకు స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలో ఐదుగురు ప్లేయర్లతో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏఐటీఏ ఆదివారం ప్రకటించింది. తెలుగు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సాకేత్‌‌‌‌‌‌‌‌ మైనేనీ, శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ బాలాజీ, యూకీ భాంబ్రీ, నిక్కీ పూనచ ఇందులో ఉన్నారు.

దిగ్విజయ్‌‌‌‌‌‌‌‌ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ను రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఎంపియ్యాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరగనున్నాయి. 1964లో చివరిసారి పాక్‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఇండియా 4–0తో ఆతిథ్య టీమ్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. ఇప్పటి వరకు డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఇండియానే విజయం సాధించింది.