కంగనా.. ఏమిటా కంగారు..! ఇన్‌స్టాలో ఆమె ఆవేదన

కంగనా.. ఏమిటా కంగారు..! ఇన్‌స్టాలో ఆమె ఆవేదన

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ పై చండీగఢ్‌ విమానాశ్రయంలో  ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటనపై బాలీవుడ్ నటీనటుల నుంచి స్పందన రాకపోవడంతో.. ఇన్‌స్టా వేదికగా కంగనా మండిపడ్డారు. బాలీవుడ్ యాక్టర్స్ యే లక్ష్యంగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత వాటిని డిలిట్ చేశారు. "ఆల్ ఐస్ ఆన్ రఫా గ్యాంగ్‌.. ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై  దాడిని మీరు సెలబ్రేట్ చేసుకుంటే.. అదే ఘటన మీకూ ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి" అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

 "నామీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు లేదంటే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయిన అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడికి పాల్పడొచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేక రఫా కోసం మీ అభిప్రాయం చెప్పినందుకు అలా జరగొచ్చు. అప్పుడు మీ వాక్‌ స్వాతంత్ర్యం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు. నేను అలా చేస్తున్నందుకు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను మీలాగా కాదు కదా " అంటూ ఇన్ స్టా రీల్ లో మరో పోస్ట్ షేర్ చేసింది. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు.