న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ట్రేడింగ్ విండో ఆప్షన్ను ఉపయోగించుకుని తక్కువ ధరకే టాలెంటెడ్ ప్లేయర్లను కొనుగోలు చేస్తోంది. ట్రేడ్ డీల్లో భాగంగా లక్నో నుంచి భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ను దక్కించుకున్న ముంబై తాజాగా మరో విధ్వంసకర ఆల్ రౌండర్ను పట్టేసింది.
ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి వెస్టిండీస్ వీరుడు షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ను ముంబై సొంతం చేసుకుంది. క్యాష్ ట్రేడ్ ఒప్పందం కింద గుజరాత్కు రూ.2.6 కోట్లు చెల్లించింది ముంబై. ఈ విషయాన్ని ఐపీఎల్ గురువారం (నవంబర్ 13) ధృవీకరించింది.
గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఫినిషర్ పాత్ర పోషించిన రూథర్ ఫోర్డ్ 11 ఇన్నింగ్స్లలో 157.29 స్ట్రైక్ రేట్, 32.33 సగటుతో 291 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడిన రూథర్ ఫోర్డ్ 137.37 స్ట్రైక్ రేట్తో 397 పరుగులు చేశాడు. ఇందులో 26 సిక్సర్లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై, గుజరాత్, బెంగుళూర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీల తరుఫున ఆడాడు ఈ వెస్టిండీస్ ప్లేయర్.
