మసీదులకు పరదాలు కట్టిన పోలీసులు

మసీదులకు పరదాలు కట్టిన పోలీసులు

హైదరాబాద్‌లో గణేష్ విసర్జనను పురస్కరించుకుని నగరంలోని శోభాయాత్ర జరిగే మార్గాల్లోని మసీదులను  గుడ్డతో కప్పారు. నగరంలోని అఫ్జల్ గంజ్, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని మసీదులను భారీ బట్టలతో కప్పారు. గణేష్ విసర్జన, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హైదరాబాద్ పోలీసులు  ఇలా  అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

Also Read : ఏషియన్ గేమ్స్లో.. భారత్కు మరో గోల్డ్ మెడల్

నగరంలోని మతపరమైన ప్రదేశాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ప్రముఖ మసీదులు, దేవాలయాల వద్ద భారీ భద్రతా బలగాలను మోహరించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగే గణేష్ ఊరేగింపుల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 50 వేల మంది పోలీసులను మోహరించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సమన్వయంతో వివిధ ప్రాంతాల్లో నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.