
మహబూబాబాద్, వెలుగు: మానుకోట డీసీసీ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఏఐసీసీ అబ్జర్వర్లు తెలిపారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ డేబాసిస్ పట్నాయక్, పీసీసీ పరిశీలకుడు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, ఎండీ అవేజ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, మహబూబాబాద్ఎమ్మెల్యే భూక్యామురళీ నాయక్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ చేసి, అధిష్టానానికి పేర్లు పంపిస్తామని, అక్కడే తుది నిర్ణయం జరుగుతుందని అబ్జర్వర్లు పేర్కొన్నారు.