రూ.100 కోట్ల భూమిని టీఆర్ఎస్ కు అప్పనంగ ఇచ్చిన్రు

రూ.100 కోట్ల భూమిని టీఆర్ఎస్ కు అప్పనంగ ఇచ్చిన్రు

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. బంజరాహిల్స్ లోని ఎకరాకు పైగా స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిపై దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం గతంలోనే కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించిందని, మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్నిఇవ్వడమేంటని ప్రశ్నించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వంద కోట్ల విలువైన భూమిని గజానికి రూ.100 కే ఇవ్వడం విడ్డూరమన్నారు. 

టీఆర్ఎస్ భవన్ లో టీవీ చానెల్ నడుపుతున్నారన్న ఆయన... అందుకే వేరే చోట పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు ప్రభుత్వ భూమిని కేటాయించారన్నారు. ప్రజల సొమ్మును టీఆర్ఎస్ దోచుకుంటోందని, ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లకు చేరాయంటే వాళ్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు కేటాయించిన స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పేదోళ్ల త్యాగాల మీద రాష్ట్రం ఏర్పడితే... పేదోళ్లు పేదోళ్లుగానే మిగిలారని... టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం కోట్లు గడించారని అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని నిలదీశారు.

మరిన్ని వార్తల కోసం...

దళితులను మభ్య పెట్టేందుకే దళిత బంధు

ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం