దళితులను మభ్య పెట్టేందుకే దళిత బంధు

దళితులను మభ్య పెట్టేందుకే దళిత బంధు

మంచిర్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని, ఆయన అబద్దాల కోరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితులను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి.. ఇవాళ మేఘా కృష్ణారెడ్డిని మాత్రం కోటీశ్వరుడిని చేశారని అన్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామంటే కేసీఆర్ కుటుంబమే ఇవాళ బంగారమైందని, పేదలు నిరుపేదలుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను మభ్య పెట్టడానికే దళిత బంధు పథకం తీసుకొచ్చారని చెప్పారు. నేడు రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. 

రాష్ట్రంలో చాలాచోట్ల దళితుల భూములను లాక్కుంటున్నారని, దళిత ద్రోహి ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వరి వేసుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది