ఇక మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్..రూ. 2 లక్షల కోట్లతో ప్రాజెక్టు

ఇక మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్..రూ. 2 లక్షల కోట్లతో ప్రాజెక్టు
  • ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ రాఫేల్స్
  • 114 ఫైటర్ జెట్​లకు ఐఏఎఫ్ ప్రపోజల్ 
  • పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖలు 
  • హైదరాబాద్​లో మెయింటనెన్స్​, రిపేర్​ సెంటర్​!

    
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్​లో పాకిస్తాన్​కు వణుకు పుట్టించిన రాఫేల్ ఫైటర్ జెట్​​లను మరిన్ని సమకూర్చుకునేందుకు భారత వాయుసేన ప్రపోజల్ పెట్టింది. కొత్తగా 114 మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ ప్రపోజల్ పెట్టగా.. కేంద్ర ఆర్థిక శాఖ, రక్షణ శాఖ పరిశీలిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2 లక్షల కోట్ల వ్యయం కానున్నట్టు అంచనా వేశారు. 

ఈ ఒప్పందంలో భాగంగా రాఫేల్ ఫైటర్ జెట్​లలో దాదాపు 60% భాగాలు ఇక్కడే తయారు చేయించనున్నారు. ఇప్పటివరకూ ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ అక్కడే రాఫేల్ జెట్​లను తయారుచేసి, భారత్ కు అందిస్తూ వచ్చింది. ఇకపై భారత్​లోనే ఇండియన్ కంపెనీలతో కలిసి వీటిని తయారుచేసిచ్చేలా రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ పీఎల్ 15 మిసైల్స్ నుంచి రాఫేల్ ఫైటర్ జెట్​లు చాకచక్యంగా తప్పించుకున్నాయి. ఈ ఆపరేషన్​లో పాక్ పై ఐఏఎఫ్ స్కాల్ప్ మిసైల్స్​ను కూడా ప్రయోగించాయి. అయితే, మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్​లో స్కాల్ప్ మిసైల్స్​కు బదులు లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను ప్రయోగించేలా మార్పులు చేస్తారు. వీటి కొనుగోలుకు కేంద్రం ఓకే చెప్తే గనక.. హైదరాబాద్​లో రాఫేల్ ఎం88 ఇంజన్ల తయారీకి డసాల్ట్ కంపెనీ మెయింటెన్స్, రిపేర్ సెంటర్​ను ఏర్పాటు చేయనుంది.