
ఇక నుంచి హైదరాబాద్ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. జనవరి 15వ తేదీన శంషాబాద్ GMR ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి షికాగోకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-షికాగో మధ్య 238 సీట్ల విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు నడిపేందుకు శంషాబాద్ విమానాశ్రయం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాద్, అమెరికా మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. అయితే… అందుకు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేవు. దీంతో నగరం నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు కనెక్టింగ్ సర్వీసులతో అమెరికా వెళ్లాలి. దీంతో హైదరాబాద్ నుండి షికాగో సర్వీసు ప్రారంభం కానుంది. ఈ సర్వీసులో 238 సీట్లు అందుబాటులో ఉంటాయి. మొదట వారానికోసారి ఉంటుందని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు.