
న్యూఢిల్లీ: గత పదహారు నెలల్లో 650 మంది పైలెట్లను నియమించుకున్నామని ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల మొదటి వారంలో రెండు బోయింగ్ బీ777 పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తాయని, దీంతో యూఎస్తో కనెక్ట్ అయ్యే సర్వీస్లు మెరుగవుతాయని వివరించారు. ఎయిర్ ఇండియా గ్రూప్ కింద ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ ఉన్నాయి.
11 బీ777ఎస్ విమానాలను లీజుకు తీసుకుంటామని కిందటేడాది ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా రూట్లలో తిప్పడానికి వీటిని తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు ఎప్పటి నుంచో గ్రౌండ్కే పరిమితమైన రెండు బోయింగ్ 787 విమానాలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని కాంప్బెల్ అన్నారు. మరోవైపు డీజీసీఏ తనిఖీలో తప్పులు దొరకడంతో కంపెనీ ముంబై, హైదరాబాద్ ట్రైనింగ్ ఫెసిలిటీలను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.