
- ఐదుగురు మెడికోలు మృతి
అహ్మదాబాద్: వాళ్లందరూ కాబోయే డాక్టర్లు. అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీలో చదువుతూ అక్కడే ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం లంచ్ టైమ్. హాస్టల్ క్యాంటిన్ హాల్లోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో భారీ శబ్ధం. అంతే..! కంచాలు చెల్లాచెదురయ్యాయి.. బిల్డింగ్ నేలమట్టమైంది. ఎయిర్పోర్ట్ నుంచి టెకాఫ్ అయిన బోయింగ్ విమానం.. దూసుకొచ్చి మెడికోల బిల్డింగ్ మీదనే కూలింది.
బిల్డింగ్ను చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో ఐదుగురు మెడికోలు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. హాస్టల్ క్యాంటిన్లోని డైనింగ్ రూమ్లో దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. టేబుల్స్ మీద చెల్లాచెదురైన భోజనం ప్లేట్లు.. ఆ పక్కనే శిథిలాల కింద, కాలిపోయిన మెడికోల మృతదేహాలు.. హృదయ విదారకంగా ఉన్నాయి.
భోజనం చేస్తూ చేస్తున్న టైమ్లో విమానం కుప్పకూలడంతో ఆ దాటికి కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతా కాలిపోయాయి. మృతుల్లో కొందరు ఎంబీబీసీ చదువుతున్న వాళ్లు కాగా.. ఇంకొందరు పీజీ డాక్టర్లు ఉన్నారు.