భోజనం చేస్తూ.. కాలిబూడిదయ్యారు..మెడికోల హాస్టల్ బిల్డింగ్ పై కూలిన విమానం

భోజనం చేస్తూ.. కాలిబూడిదయ్యారు..మెడికోల హాస్టల్ బిల్డింగ్ పై కూలిన విమానం
  • ఐదుగురు మెడికోలు మృతి

అహ్మదాబాద్:  వాళ్లందరూ కాబోయే డాక్టర్లు. అహ్మదాబాద్​లోని బీజే మెడికల్​ కాలేజీలో చదువుతూ అక్కడే ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం లంచ్​ టైమ్​. హాస్టల్​ క్యాంటిన్​ హాల్​లోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో భారీ శబ్ధం. అంతే..! కంచాలు చెల్లాచెదురయ్యాయి.. బిల్డింగ్​ నేలమట్టమైంది. ఎయిర్​పోర్ట్​ నుంచి టెకాఫ్​ అయిన బోయింగ్​ విమానం.. దూసుకొచ్చి మెడికోల బిల్డింగ్​ మీదనే కూలింది.

బిల్డింగ్​ను చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో ఐదుగురు మెడికోలు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. హాస్టల్​ క్యాంటిన్​లోని డైనింగ్​ రూమ్​లో దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి. టేబుల్స్​ మీద  చెల్లాచెదురైన భోజనం ప్లేట్లు.. ఆ పక్కనే శిథిలాల కింద, కాలిపోయిన మెడికోల మృతదేహాలు.. హృదయ విదారకంగా ఉన్నాయి.

 భోజనం చేస్తూ చేస్తున్న టైమ్​లో విమానం కుప్పకూలడంతో ఆ దాటికి కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతా కాలిపోయాయి. మృతుల్లో కొందరు ఎంబీబీసీ చదువుతున్న వాళ్లు కాగా.. ఇంకొందరు పీజీ డాక్టర్లు ఉన్నారు.