బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్..ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్

బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్..ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే  విమాన టికెట్లను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా 96 హవర్ సేల్‌ పేరుతో ఈ ఆఫర్ ను  అందిస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ. 1470కే ప్రయాణికులు  టికెట్ ను కొనుగోలు చేసి ఎయిరిండియా విమానంలో ప్రయాణించొచ్చు. 

ఎప్పటి నుంచి సేల్..

ఎయిర్ ఇండియా 96 హవర్ సేల్  ఆగస్ట్ 17 నుంచి  ప్రారంభమైందిజ. ఈ ఆఫర్ దేశీ విమాన ప్రయాణానికే వర్తిస్తుంది. అది కూడా వన్ వే ఎకానమీ క్లాస్ ప్రయాణానికి ఈ రేటు చెల్లించాలి. అయితే  బిజినెస్ క్లాస్ ప్రయాణానికి మాత్రం రూ. 10,130 నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుంది.  

ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఎయిర్ ఇండియా వెబ్‌సైట్(https://www.airindia.com/) లేదా ఎయిర్ ఇండియా కంపెనీ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల  కన్వీనియన్స్ ఫీజు కూడా ఉండదు. అంతేకాకుండా ఎయిర్ ఇండియలోనే రిటర్న్ జర్నీ కూడా చేస్తే... అప్పుడు ప్రయాణికులకు డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లు దక్కుతాయి. అన్ని రకాల టికెట్లకు ఇది వర్తిస్తుంది అని ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

ఎప్పుడు ప్రయాణించాలి..?

ఎయిర్ ఇండియా 96 హవర్ సేల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు  ప్రయాణం చేయొచ్చు. ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ సేల్ ఆగస్ట్ 20 వరకు ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.