హైదరాబాద్, వెలుగు: దేశ, విదేశీ రూట్ల కోసం 96– గంటల స్పెషల్ సేల్ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్ రూట్లలో ఒకవైపు ఎకానమీ క్లాస్ టికెట్ను రూ.1,470 నుంచి ఆఫర్ చేస్తోంది. బిజినెస్ క్లాస్ టికెట్ను రూ.10,310 నుంచి ఆఫర్ చేస్తోంది. కొన్ని ఇంటర్నేషనల్ రూట్లలో కూడా ఇలాంటి ఆఫర్లనే ప్రకటించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికే ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటే డబుల్ లాయల్టీ బోనస్ పాయింట్లు పొందొచ్చు. వచ్చే నెల 1 నుంచి అక్టోబర్ 31 మధ్య ట్రావెల్ కోసం ఈ నెల 17–20 మధ్య బుకింగ్స్ చేసుకోవాలి. అథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లు, ఆన్లైన్ ఏజెంట్ల ద్వారా కూడా ఈ ఆఫర్ కింద బుకింగ్స్ చేసుకోవచ్చు.