కాలనీలో.. ఇళ్లపై ఎలా కూలింది: విమానంలో 242 మంది ప్రయాణికులు

కాలనీలో.. ఇళ్లపై ఎలా కూలింది: విమానంలో 242 మంది ప్రయాణికులు

గాంధీనగర్: గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానం జనవాసాల మధ్య కుప్పకూలింది. ప్రమాదానికి గురైన విమానం అహ్మదాబాద్‎లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తోంది.

క్రాష్ అయిన ఫ్లైట్ బోయింగ్ కంపెనీకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. అందులో 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు తెలిసింది. గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని మేఘాని నగర్ ప్రాంతంలో విమానం క్రాష్ అయ్యింది. కాలనీలో ఇళ్లపై కుప్పకూలింది. మేఘాని నగర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి

జనవాసాల మధ్య ఫ్లైట్ కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్లు, ఫైరింజన్లు ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెందినట్లు సమాచారం. అధికారుల మాత్రం మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక నివేదికలు వస్తున్నాయి. కానీ ఫ్లైట్ క్రాష్ కావడానికి అసలు కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియదు. 

భారతదేశంలోనే అతి పెద్ద విమాన ప్రమాదం ఇది. గుజరాత్ రాష్ట్రం.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలోని మేఘాని అనే కాలనీలో.. ఇళ్లపై కూలిపోయింది విమానం. 


>>> ఎయిర్ ఇండియా విమానం నెంబర్ AI 171. బోయింగ్ 787 మోడల్ ఫ్లయిట్ ఇది. 
>>> విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుంది.
>>> విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది విమాన సిబ్బంది. 
>>> అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 2025, జూన్ 12వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాల సమయంలో బయలుదేరినట్లు సమాచారం. 
>>> ఎయిర్ పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. ఎయిర్ పోర్ట్ సమీపంలోని మేఘాని అనే కాలనీపై కుప్పకూలిపోయింది.