అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

Also Read : అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. అగ్ని మాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ,పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఇద్దరు మంత్రులను అహ్మదాబాద్ వెళ్లి బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని ప్రధాని కోరారు. ఈ ప్రమాదం తర్వాత అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కూడా మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. 

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787. దాని విమాన నంబర్ AI-171 అహ్మదాబాద్ నుండి గాట్విక్‌కు వెళ్లింది.ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 2 పైలట్లు, క్యాబిన్ సిబ్బంది10 మంది, ప్రయాణికులు 230 మంది ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సభర్వాల్ LTCకి 8,200 గంటల అనుభవం ఉండగా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు 1,100 గంటల అనుభవం ఉంది. 

ప్రమాదం గురించి, మృతులు, ఇతర వివరాలకు 011-24610843 , 9650391859 నంబర్‌లను జారీ చేసింది DGCA. 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..37 సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాద జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ ప్రమాదంలో మొత్తం 137 మంది మరణించారు. ఈ ప్రమాదంలో బోయింగ్ 737-200 విమానం వాతావరణ అనుకూలించకపోవడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం నోబుల్ నగర్‌లోని ఒక పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదం భారత చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం.