గ్రీన్చానల్ ద్వారా లైవ్ఆర్గాన్స్ తరలింపు
శంషాబాద్, వెలుగు: బెంగళూరు కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి నుంచి వచ్చిన లైవ్ ఆర్గాన్స్ను గ్రీన్ చానెల్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకు బెంగళూరు నుంచి ఫ్లైట్(6ఈ 649 ) శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు, వైద్య బృందానికి సహకరించి ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా30 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించారు.