న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు, టెలికం కంపెనీ ఎయిర్టెల్తో కలసి కో–బ్రాండెడ్ క్రెడిట్కార్డును లాంచ్ చేసింది. దేశంలోని 34 కోట్ల మంది ఎయిర్టెల్ కస్టమర్లు దీంతో ప్రయోజనాలు పొందవచ్చని యాక్సిస్ తెలిపింది. ప్రీఅప్రూవ్డ్, బయ్ నౌ పే లేటర్ లోన్లు, క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లు, డిజిటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ సర్వీసుల వంటి ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతమని ప్రకటించింది. ఎయిర్టెల్ మొబైల్/డీటీహెచ్ రీఛార్జ్లు, ఎయిర్టెల్ బ్లాక్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ పేమెంట్స్పై 25శాతం క్యాష్బ్యాక్ ఉంటుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్స్ చెల్లిస్తే 10శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు. బిగ్బాస్కెట్, స్విగ్గి, జొమాటో యాప్స్లో ఈ కార్డుతో డబ్బు చెల్లిస్తే10శాతం క్యాష్బ్యాక్ వస్తుంది. ఇతర ఖర్చులపై 1శాతం క్యాష్బ్యాక్ ఉంటుంది.