న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో భారతీ ఎయిర్టెల్ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించింది. . టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' డేటా ప్రకారం, ఎయిర్టెల్ కొత్తగా 26.88 లక్షల వైర్లెస్ వినియోగదారులను చేర్చుకోగా, రిలయన్స్ జియో 24.46 లక్షల మంది కొత్త యూజర్లను సొంతం చేసుకుంది.
జులై నాటికి భారత వైర్లెస్ యూజర్ల సంఖ్య 55.38 లక్షలు పెరిగి, మొత్తం బేస్ 128.23 కోట్ల నుంచి 128.79 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 26.88 లక్షలు పెరిగి 48.94 కోట్లకు చేరింది. జియో యూజర్ల సంఖ్య 24.46 లక్షలు చేరి 50.60 కోట్లకు పెరిగింది. వోడాఫోన్ ఐడియా యూజర్ల బేస్ 2.40 లక్షల కొత్త యూజర్లను పొంది 19.90 కోట్లకు చేరింది.
