హైదరాబాద్, వెలుగు: క్రీడలు, ఫిట్నెస్, న్యూట్రిషన్ రంగాల కలయికగా స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 9వ ఎడిషన్ శుక్రవారం హైటెక్స్లో ప్రారంభమైంది.
హైటెక్స్ డైరెక్టర్ కున శంకర్, ఎన్ఎండీసీ డైరెక్టర్ కృష్ణ కుమార్ ఠాకూర్, హైదరాబాద్ రన్నర్స్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెట్చా కలిసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
రెండు రోజుల పాటు సాగే ఈ ఎక్స్పోలో 50కి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు.
