
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ అదిరిపోయే రిజల్ట్స్ ప్రకటించింది. కస్టమర్లు పెరగడంతో డిసెంబర్ క్వార్టర్లో రూ. 2,442.2 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.1,588.2 కోట్లతో పోలిస్తే ఇది 54 శాతం ఎక్కువ. కిందటేడాది జనవరిలో ప్లాన్ రేట్లను పెంచిన తర్వాత నుంచి కంపెనీ కస్టమర్లు నెలకు సగటున రూ.155 తో రీఛార్జ్ చేస్తున్నారు.
ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్ మాత్రం మరోసారి ప్లాన్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇన్వెస్ట్మెంట్లపై ఇంకా రిటర్న్ రాలేదని పేర్కొన్నారు. ఆఫ్రికన్ కరెన్సీ వాల్యూ తగ్గినా, ఎయిర్టెల్ రెవెన్యూ (కన్సాలిడేటెడ్) క్యూ3 లో రూ. 37,899.5 కోట్లకు చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం రూ.35,8904.4 కోట్ల నుంచి 5.8 శాతం పెరిగింది. ఎయిర్టెల్ మొత్తం కస్టమర్లు 55.1 కోట్లకు చేరుకున్నారు. ఇందులో ఇండియా నుంచి 39.7 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) క్యూ3 లో రూ. 193 నుంచి రూ.208 కి పెరిగింది.