
హైదరాబాద్: ఆపరేషన్సిందూర్ వేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది . దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా.. లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్– పాక్ ఉద్రిక్తత వేళ బాంబు బెదిరింపు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.