ఐశ్వర్యకి కలిసొచ్చే అంశమే

ఐశ్వర్యకి కలిసొచ్చే అంశమే

టాలీవుడ్‌‌కి మలయాళ అమ్మాయిలు ఎక్కువగానే వస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది ఇక్కడ హీరోయిన్లుగా చక్రం తిప్పారు, తిప్పుతున్నారు. వారి బాటలోనే అడుగులు వేసింది ఐశ్వర్యలక్ష్మి. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ‘గాడ్సే’ మూవీలో ఫిమేల్ లీడ్‌‌గా కనిపించి మరింత చేరువయ్యింది. ప్రస్తుతం మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. త్వరలో ‘పొన్నియిన్ సెల్వన్’తోనూ పలకరించబోతోంది. ఇవి కాక ఆమె చేతిలో మరో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ‘కింగ్ ఆఫ్ కోట’ ఒకటి. 

ఇది దుల్కర్ సల్మాన్‌‌కి డ్రీమ్ ప్రాజెక్ట్. అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్నాడు. పోయినేడు అఫీషియల్‌‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్‌‌గా తమిళనాడులో షూటింగ్ మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌‌తో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌‌స్టర్ డ్రామాలో పృథ్విరాజ్ సుకుమారన్ ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తాడని, సమంత కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుందని టాక్. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించడం ఐశ్వర్యకి కలిసొచ్చే అంశమే. ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీ విడుదల కానుంది కనుక ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడం ఖాయమే.