సాయితేజ్ హీరోగా మిస్టికల్‌‌‌‌ థ్రిల్లర్

సాయితేజ్ హీరోగా మిస్టికల్‌‌‌‌ థ్రిల్లర్

హీరో కోసమే సినిమాకి వెళ్లే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. అయితే ఓ సినిమా సక్సెస్‌‌‌‌కి హీరోతో పాటు మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో అవసరం. అందుకే బెస్ట్ టీమ్‌‌‌‌ని సెట్ చేస్తుంటారు నిర్మాతలు. ఇప్పుడు సాయితేజ్ సినిమాకి కూడా అలాంటి ఓ అడిషనల్ అట్రాక్షన్ యాడ్ అయ్యింది. సాయితేజ్ హీరోగా ఓ మిస్టికల్‌‌‌‌ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ స్క్రీన్‌‌‌‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్‌‌‌‌తో కలిసి బీవీఎస్‌‌‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి అజనీష్‌‌‌‌ లోక్‌‌‌‌నాథ్‌‌‌‌ని సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు  టీమ్ నిన్న ప్రకటించింది. విక్రాంత్ రోణ, కాంతారా లాంటి భారీ చిత్రాలకు సంగీతం అందించాడు అజనీష్. ఆ సినిమాలకి ఈయన సంగీతం ప్లస్ అయ్యింది. అందుకే తమ చిత్రానికి అతనిని ఏరి కోరి తీసుకున్నారు దర్శక నిర్మాతలు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ మూవీకి శ్యామ్‌‌‌‌ దత్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. మూవీ ప్రస్తుతం సెట్స్‌‌‌‌పై ఉంది.