హైదరాబాద్, వెలుగు: CZ రెడ్డి ఓఎస్డీగా బి.అజిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ కు చెందిన అజిత్ రెడ్డి ఐదేండ్ల పాటు డిప్యూటేషన్పై స్టేట్ గవర్నమెంట్లో బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అజిత్ రెడ్డి బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఐడీఈఎస్ 2012 బ్యాచ్కు చెందిన అజిత్ రెడ్డి గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుల్లో పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేసిన సమయంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్తో అజిత్ రెడ్డికి పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అందుకే ఇప్పుడు ఓఎస్డీగా పెట్టుకున్నట్లు సమాచారం. అజిత్ శనివారమే ఓఎస్డీగా బాధ్యతలు తీసుకోనున్నారు.