షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్

షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్

బండ్లగూడ మండల పరిధిలో అర్హులైన వారికి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. బాబా నగర్ కోహినూర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హత కలిగిన 735 మందికి చెక్కులను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పంపిణీ చేశారని బండ్లగూడ మండల తహశీల్దార్ ఫర్హిన్ షేక్ చెప్పారు. మొత్తం 7 కోట్ల 11 లక్షల 73 వేల 636 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారని చెప్పారు. కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ  కార్పొరేటర్లు, నాయకులు మండల సిబ్బంది పాల్గొన్నారు.