తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తితో పాలన జరగాలి : ఆకునూరి మురళి

తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తితో  పాలన జరగాలి : ఆకునూరి మురళి

ఖైరతాబాద్, వెలుగు: రాజ్యాంగస్ఫూర్తితో పాలన జరగాలని రిజైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  ‘దళిత ఉపకులాల సమస్యలపరిష్కారానికై’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  శుక్రవారం రౌండ్ టేబుల్​సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆకునూరి మురళి హాజరై, మాట్లాడారు. 

అంబేద్కర్​భావజాలానికి కొందరు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.  కుల గణన సాధ్యం కాదని చెప్పిన బీజేపీకి మంద కృష్ణ మాదిగ ఎందుకు సపోర్టు చేశారని ప్రశ్నించారు. ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్​ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం ఎస్సీ సబ్​ప్లాన్ ను​నిర్వీర్యం చేసిందని.. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు  బైరి వెంకటేశం అన్నారు. 

సమస్యలు చెప్పుకోవడానికి చట్టసభల్లో  తమ నాయకుడు ఒక్కరు కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.దళిత బంధు, డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల పథకం ఏ ఒక్కరికి అందలేదన్నారు. ఎస్సీ ఉపకులాలకు కుల ధ్రువీకరణ పత్రం తహసీల్దార్​ ద్వారా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సదస్సులో  రచయిత వేణు, డీబీఎఫ్ నేత పి.శంకర్, నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయిల లక్ష్మీ నర్సయ్య చిందు తదితరులు పాల్గొన్నారు.