ఇస్రో శాస్త్రవేత్తకు అలంపూర్ ఎమ్మెల్యే సన్మానం

ఇస్రో శాస్త్రవేత్తకు అలంపూర్ ఎమ్మెల్యే సన్మానం

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కుమారుడు, ఇస్రో శాస్త్రవేత్త కుమ్మరి కృష్ణను అలంపూర్  ఎమ్మెల్యే అబ్రహం సన్మానించారు. కృష్ణ తన స్వగ్రామమైన ఉండవల్లికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారి ఇంటికి వెళ్లి కృష్ణను అభినందించారు. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ దేశానికి, గ్రామానికి కృష్ణ మంచి పేరు తెచ్చారని ఎమ్మెల్యే కొనియాడారు. కృష్ణ తల్లిదండ్రులను సైతం ఎమ్మెల్యే శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  రేఖ పాల్గొన్నారు.

– వెలుగు, అలంపూర్