స్నేహితురాలి మృతికి కారణమైన ఐదుగురు అరెస్ట్

స్నేహితురాలి మృతికి కారణమైన ఐదుగురు అరెస్ట్

మద్యం మత్తులో కారు నడిపి స్నేహితురాలి మృతికి కారణమైన ఐదుగురు యువకులను మాదాపూర్​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జేఎన్​టీయూ ప్రాంతంలో ఉండే బస్వధర్మప్రకాశ్​ కుమారుడు సచిత్ ​బాబు(21) గీతం కాలేజీలో బీటెక్ ​ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అదే కాలేజీలో చదువుతున్న నిజాంపేటకు చెందిన రాపోలూ భగత్, బీహెచ్ఈఎల్ కి చెందిన మహ్మద్ అఫ్జల్, తలారి ప్రణీత్, తౌటి రాహుల్​రెడ్డి సచిత్ ఫ్రెండ్స్.

వీరంతా ఆదివారం అర్ధరాత్రి12 గంటల సమయంలో తమ స్నేహితురాలు సాయి విహితతో కలిసి అఫ్టల్ కారులో కేపీహెచ్ బీ నుంచి మాదాపూర్​ వెళ్లారు. స్ర్టీట్ డ్రైవ్​ ఇన్ హోటల్ సమీపంలోని ఓ ఇంట్లో అంతా మద్యం తాగారు. అనంతరం అక్కడి నుంచి మెహిదీపట్నంలో ఉండే మరో స్నేహితురాలిని కలిసేందుకు బయలుదేరారు. మద్యం మత్తులో సచిత్ బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. విహిత కారులో సచిత్​ పక్కన కూర్చుంది. మిగిలిన నలుగురు వెనుకాల కూర్చున్నారు. మాదాపూర్​లోని రెట్రో రెస్టారెంట్​వద్ద వీరి కారు ఓవర్​ స్పీడ్​తో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి, డివైడర్​పైకి ఎక్కింది. విహిత ఎగిరి రోడ్డు మీద పడగా..

ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ సచిత్​బాబుతో పాటు మిగతా నలుగురు యువకులు పారిపోయారు. గాయపడ్డ ఆటో డ్రైవర్ ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు సోమవారం బీహెచ్ఈఎల్​లో ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని పీఎస్​కు తరలించారు.