హైదరాబాద్, వెలుగు: స్పెయిన్లో జరిగే ఇంటర్నేషనల్ 420 క్లాస్ వరల్డ్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అలేఖ్య కుండూ (హెల్మ్), పిల్లి అఖిల్ (క్రూ) బరిలోకి దిగనున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇండియా నుంచి ఈ జోడీకి మాత్రమే అర్హత లభించడం విశేషం. గతేడాది మూడు పోటీల్లో ఈ జోడీ అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపించడం కలిసొచ్చిందని సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగెట్టా నిర్వాహకులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 126 మంది టాప్ సెయిలర్లతో తెలంగాణ జోడీ పోటీపడనుంది. ఈ నెల 21 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీ కోసం అలేఖ్య, అఖిల్ 17న హైదరాబాద్ నుంచి స్పెయిన్కు బయలుదేరనున్నారు. టోర్నీకి ముందు ఓ వారం పాటు వీళ్లు స్పెయిన్లోని ప్రొఫెషనల్ సెయిలర్ జోస్ రూయిజ్ సాంచెజ్తో శిక్షణ తీసుకోనున్నారు.