శర్మిష్ట పనోలిని విడిచి పెట్టండి..ఆమె అరెస్ట్​ను ఖండించిన డచ్​ఎంపీ

శర్మిష్ట పనోలిని విడిచి పెట్టండి..ఆమె అరెస్ట్​ను ఖండించిన డచ్​ఎంపీ
  • ఆమె హక్కులను కాపాడాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్​

కోల్​కతా: ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో అరెస్టయిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లా స్టూడెంట్​ శర్మిష్ట పనోలీకి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఆమెను కోల్​కతా పోలీసులు అరెస్ట్​ చేయడాన్ని డచ్​ ఎంపీ గీర్ట్​ విల్డర్స్​ ఖండించారు. ఇది వాక్ స్వాతంత్య్రానికి అవమానకరం అని పేర్కొన్నారు.

ఈమేరకు ‘ఎక్స్​’లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘శర్మిష్ట పనోలిని విడుదల చేయండి. ఆమెను అరెస్టు చేయడం వాక్ స్వేచ్ఛకు అవమానం. పాకిస్తాన్​, మహ్మద్​ ప్రవక్త గురించి మాట్లాడినందుకు ఆమెను శిక్షించకండి. ప్రధాని మోదీజీ.. ఆమె హక్కులను కాపాడండి” అని వ్యాఖ్యానించారు.  ఈ పోస్ట్​కు ‘ఆల్​ ఐస్​ ఆన్​ శర్మిష్ట’ అని రాసిఉన్న ఆమె ఫొటోను జోడించారు. మహ్మద్​ ప్రవక్తపై 2022లో బీజేపీకి చెందిన నుపుర్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు ఆమెకు కూడా గీర్ట్​ విల్డర్స్​ మద్దతుగా నిలిచారు.

గతంలో ఇలా స్పందించలేదేం.. పవన్​ కల్యాణ్​

శర్మిష్ట పనోలి అరెస్ట్​పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​కూడా స్పందించారు. దైవ దూషణను ఖండించాల్సిందే అంటూనే.. లౌకికవాదాన్ని ఓ కవచంగా ఉపయోగించొద్దని అన్నారు. గతంలో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడిన టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్​పోలీసులను  ప్రశ్నించారు. 

సనాతన ధర్మంపై పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ  మాట్లాడిన వీడియోను పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పోస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు అందరిపట్ల ఒకేలా వ్యవహరించాలని సూచించారు. అలాగే, శర్మిష్ట అరెస్ట్​ను పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఖండించారు. 

రాష్ట్రంలో సనాతనవాదులపైన మాత్రమే చర్యలు తీసుకుంటారని ఫైర్​ అయ్యారు. పనోలిని కావాలని అరెస్టు చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఆరోపించారు. ఒక వర్గం మద్దతు కోసం యువ హిందూ మహిళను అరెస్ట్​ చేయడం దారుణమని అన్నారు.