పరిగి, వెలుగు: మార్కెట్యార్డుల్లో రైతులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పరిగి మార్కెట్ యార్డులో రూ.1.98 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, రైతులకు విశ్రాంతి భవనాలు, విద్యుత్ వసతి, అన్నపూర్ణ క్యాంటీన్, వేబ్రిడ్డి నిర్మాణ పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చెర్మన్ అయూబ్, ఆత్మ కమిటీ చైర్మన్ మంచన్పల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
