హైదరాబాద్, వెలుగు : కొత్త పార్లమెంట్వేదికగా మహిళలను కేంద్రం మోసం చేసిందని ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఆరోపించారు. మహిళా బిల్లుపై ప్రధాని మోదీ కేవలం ఒక ప్రకటన మాత్రమే చేశారని, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఆయనకు లేదని విమర్శించారు. 2034కి ముందు నారీశక్తి వందన్ బిల్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. అయినా ఎప్పుడో అమలు చేసేదానిపై ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
సోమవారం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లులను లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో పెట్టాలని మహిళలు వీధుల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. పదేండ్లుగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు సడన్గా బిల్లును ఎందుకు పెట్టిందని నిలదీశారు. బిల్లు అమలుకు జనాభా లెక్కలు, డీలిమిటేషన్తో ఎందుకు లింకు పెడుతున్నారో చెప్పాలన్నారు.