
ముంబై: ఐపీఎల్ 13వ ఎడిషన్కు సన్నాహకంగా వచ్చే నెల 25న నిర్వహించాలనుకున్న ఆల్స్టార్ మ్యాచ్ లీగ్ చివరికి మారింది. మే 24న జరిగే ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఈ మ్యాచ్ ఉండనుంది. మ్యాచ్ జరిగే తేదీ, వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్ లార్జెస్ట్ స్టేడియం మొతెరాలో ఈ మ్యాచ్ జరిగే చాన్సుంది. లీగ్లో పెర్ఫామెన్స్ ఆధారంగా ఆల్స్టార్ మ్యాచ్ ఆడే రెండు జట్లకు ప్లేయర్స్ను ఎంపిక చేస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ చెప్పారు. మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. అంతకముందు మార్చి 18న ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత ఆసియా ఎలెవన్ , వరల్డ్ ఎలెవన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం పలువురు ఇండియన్ క్రికెటర్లు బంగ్లాదేశ్ వెళ్తారు. ప్లేయర్స్ అందుబాటుతో పాటు బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాల దృష్ట్యా ఆల్స్టార్ మ్యాచ్ను లీగ్ ముగిశాక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.