![ప్రజలంతా ఏకమై కేసీఆర్ ను గద్దె దించాల్సిందే : పాశం యాదగిరి](https://static.v6velugu.com/uploads/2023/11/all-the-people-should-unite-and-oust-kcr-says-paasham-yadagiri_S6qtLc5RnO.jpg)
ఖైరతాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజలంతా ఏకమై.. సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిందేనని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. ‘కేసీఆర్ను గద్దె దించే సమావేశం’ పేరుతో తెలంగాణ నిరుద్యోగ రక్షణ (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీటింగ్కు పాశం యాదగిరి హాజరై మాట్లాడారు.
‘‘మేడిగడ్డ కొట్టుకు పోతే.. లేదంటున్నడు.. క్వశ్చన్ పేపర్లు లీక్ కాలేదట.. ప్రవళిక ఆత్మహత్య చేసుకోలేదట.. ఇలా కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్తున్నడు. ఆ మేడిగడ్డే కేసీఆర్కు బొందల గడ్డ అయితది. 42 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నరు.. వారంతా కేసీఆర్కు వ్యతికేంగా ఓట్లు వేస్తే ఎమైతడు.. అందరూ ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ను ఓడించాలే..’’ అని యాదగిరి అన్నారు. ఉద్యోగ విరమణ వయసును 58 ఏండ్ల నుంచి 61ఏండ్లకు పెంచడంతో మహబూబాద్పరిధిలోని గండెంగకు చెందిన సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు.
ఆ సమయంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తమని చెప్పి.. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. ఈ సందర్భంగా సునీల్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బిడ్డలారా.. ఉద్యోగాలు రాకున్నా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అనంతరం అడ్వొకేట్ శరత్కుమార్, కళాకారులు పృధ్వీ రాజ్, విష్ణు, రమేశ్, జడ్సన్ మాట్లాడారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు పాటల ద్వారా ఓటర్లను చైతన్య పర్చేందుకు బస్సు యాత్రను చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ హటావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు పోతామన్నారు.