బీజేపీకి నితీశ్ పంచ్

బీజేపీకి నితీశ్ పంచ్
  • బీహార్ కేబినెట్ విస్తరణలో పదవులన్నీ జేడీయూకే

కేంద్ర కేబినెట్​లో 2 మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ బీహార్​ సీఎం, జేడీయూ చీఫ్​ నితీశ్ కుమార్​ తాజాగా బీజేపీకి పంచ్​ ఇచ్చారు. ఆదివారం రాష్ట్ర కేబినెట్​ను విస్తరించిన ఆయన, కొత్తగా ఎనిమిది మంది జేడీయూ నేతలకు మంత్రిపదవులిచ్చుకున్నారు. బీజేపీ, ఎల్జేపీకి విస్తరణలో చోటుదక్కలేదు. నితీశ్ ఆఫర్​ చేసిన ఒకే ఒక్క బెర్త్​ను తీసుకునేందుకు బీజేపీ నిరాకరించింది. రాజ్​భవన్​లో గవర్నర్​ లాల్జీ టండన్​ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీలన్నీ హాజరుకావడం గమనార్హం. ‘‘ఒక పోస్ట్​ తీసుకోమని సీఎం కోరారు. కానీ తర్వాత తీసుకుంటామని చెప్పాం’’అని బీజేపీ నేత, బీహార్​ డిప్యూటీ సీఎం సుశీల్​ మోడీ తెలిపారు. కేంద్ర కేబినెట్​లో చేరిక విషయమై బీజేపీతో ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేసిన సీఎం నితీశ్, ‘‘పొత్తు కుదిరినప్పుడే ఏ పార్టీ ఎన్ని మంత్రి పదవులు, ఏ శాఖలు కేటాయించాలో డిసైడ్​ చేసుకున్నాం. లోక్​సభ ఎన్నికల తర్వాత జేడీయూ కోటాలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవాళ్టి విస్తరణతో వాటిని భర్తీ చేశాం”అని వివరించారు.