ఓటమి భయంతోనే కాకా ఫ్యామిలీపై ఆరోపణలు

ఓటమి భయంతోనే కాకా ఫ్యామిలీపై ఆరోపణలు
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు క్షమాపణ చెప్పాలి 
  • దళిత సంఘాల నాయకుల డిమాండ్

మంచిర్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో ఓటమి భయంతోనే బీజేపీ లీడర్లు కాకా వెంకటస్వామి ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు చేసిన కామెంట్లను ఖండించారు. సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల అంబేద్కర్​ చౌరస్తాలో నిరసన తెలిపారు.  

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులు రాజకీయంగా ఎదిగితే బీజేపీ లీడర్లు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కాకా మనుమడు వంశీకృష్ణ సేవలను గుర్తించి కాంగ్రెస్​ హైకమాండ్​ పెద్దపల్లి టికెట్​ఇచ్చిందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​లోని ఎమ్మెల్యేలను కలుపుకొని వంశీ గెలుపునకు కృషి చేయడాన్ని రఘునాథ్​ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దళితులను కించపర్చే కామెంట్లను వెనక్కు తీసుకోవడంతో పాటు కాకా ఫ్యామిలీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.  దళిత సంఘాల నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్​, కనుమల్ల నర్సయ్య, దొంతమల్ల శివకుమార్, గజెల్లి రాజమల్లు, ఎర్రోళ్ల నరేశ్, సొల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. 

కోల్​బెల్ట్, వెలుగు: రఘునాథ్​ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సీనియర్​ లీడర్​ సొతుకు సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మందమర్రి పాతబస్టాండ్​ ఏరియాలో నిరసన చేపట్టారు. రాజకీయ పదవులు ఉన్నాలేకున్నా కాకా కుటుంబానికి చెందినచెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేస్తున్నారని సుదర్శన్ ​పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం విశాఖ ట్రస్టు ద్వారా వేల సంఖ్యలో బోర్లు వేయించారన్నారు. బీజేపీ లీడర్​ రఘునాథ్​అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లీడర్లు  ఆఫీజ్, కడలి శ్రీనివాస్​, నర్సోజీ, పోలు శ్రీనివాస్  పాల్గొన్నారు.