న్యూఢిల్లీ: ఒడిషాలోని ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రపై నమోదైన పలు పిటిషన్ల మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ముందు కేంద్రం తన వాదనలు వినిపించింది. ఏటా నిర్వహించే జగన్నాథ రథయాత్రను కరోనా దృష్ట్యా ఈసారి ప్రజలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని సుప్రీంను కేంద్రం కోరింది. కేంద్ర వాదనకు ఒడిశా సర్కార్ కూడా మద్దతు తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జగన్నాథ రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని గత గురువారం సుప్రీం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి రథయాత్ర తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్నా.. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలతో దీనిపై సందిగ్ధత నెలకొంది. ‘ఇది కోట్లాది మంది విశ్వాసానికి సంబంధించింది. ఒకవేళ జగన్నాథ స్వామి ఇప్పుడు బయటకు రాకపోతే ఆచారం ప్రకారం మరో 12 ఏళ్ల వరకు రావడం కుదరదు’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ విషయంపై లోతైన విచారణ జరిపేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
జనం లేకుండానే జగన్నాథ రథయాత్ర.. అనుమతించాలని సుప్రీంకు కేంద్రం వినతి
- దేశం
- June 22, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతోంది : బండి సంజయ్
- పాతరాజంపేటలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- గ్రాండ్ గా మేడే వేడుకలు
- కాంగ్రెస్ ప్రజాపాలనను అందిస్తోంది
- మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్ మున్షీ
- మద్యం నిల్వలపై దృష్టి పెట్టాలి : సౌరబ్
- కోడ్ ముగియగానే అన్ని గ్యారంటీలు అమలు : ఎమ్మెల్యే విజయరమణారావు
- గ్రూప్–1 ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు
- కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- రెడ్ జోన్లో గద్వాలలోని నాలుగు గ్రామాలు
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు