పెండింగ్ డీఏల విడుదలకు అనుమతివ్వండి

పెండింగ్ డీఏల విడుదలకు అనుమతివ్వండి

హైదరాబాద్​, వెలుగు :  దీపావళి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎదురుచూస్తున్న మూడు పెండింగ్  డీఏల విడుదలకు అనుమతినివ్వాలని సీఈఓ వికాస్ రాజ్ ను టీఎన్జీవో కేంద్ర సంఘం సభ్యులు కోరారు. పెండింగ్​ డీఏలను రిలీజ్​ చేసేలా చూడాలని ఎన్నికల కమిషన్ అనుమతించాలన్నారు. సీఈఓను కలిసిన వారిలో   టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ , టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్,  హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మూజీబ్ హుస్సేనీ తదితరులు ఉన్నారు.